అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో 420 సీఎం నన్ను ఏ14గా చేర్పించాడు: నారా లోకేశ్

  • యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారన్న లోకేశ్
  • జీవో 1 తెచ్చినా.. యువగళం జనగళమై గర్జించిందని వ్యాఖ్య
  • ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా యువగళం ఆగదన్న లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ యువనేత నారా లోకేశ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువగళం పేరు వింటేనే సైకో జగన్ గజగజలాడుతున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు. తన పాదయాత్ర ప్రారంభం కాకూడదని జీవో 1 తెచ్చినా... యువగళం ఆగలేదని, జనగళమై గర్జించిందని అన్నారు. ఎక్కడికక్కడ అడ్డుకున్నా జనజైత్రయాత్రగా ముందుకు సాగిందని చెప్పారు. మళ్లీ యువగళం ఆరంభిస్తామనే సరికి... తన శాఖకు సంబంధం లేని, అసలు వేయని రింగ్ రోడ్డు కేసులో తనను ఈ 420 సీఎం ఏ14గా చేర్పించారని మండిపడ్డారు. రిపేర్ల పేరుతో రాజమండ్రి బ్రిడ్జిని మూసేయించారని విమర్శించారు. నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, అక్రమ అరెస్టులు చేసినా యువగళం ఆగదని చెప్పారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా జన చైతన్యమే యువగళాన్ని వినిపిస్తుందని, ఇచ్ఛాపురం వరకు నడిపిస్తుందని అన్నారు. 


Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP

More Telugu News